Gaganyaan Mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ తొలి వ్యోమగామి..ఎప్పుడంటే..?
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు
- లోక్ సభలో మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి
- ఇది ఇస్రో.. నాసా..యాక్సియమ్ స్పేస్ ఉమ్మడి మిషన్
- గగన్యాన్ శిక్షణా కార్యక్రమం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు. ఇది ఇస్రో(ISRO), నాసా (NASA), యాక్సియమ్ స్పేస్ (Axiom Space) అనే ప్రైవేట్ కంపెనీల మధ్య ఉమ్మడి మిషన్ అవుతుంది. ఈ మిషన్ కోసం ఆక్సియమ్ స్పేస్తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మిషన్ను ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్టు 2024లో ప్రారంభించవచ్చు.
READ MORE: Dog Meat Row: బెంగళూర్ హోటళ్లకు కుక్క మాంసం.. ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు..
Also Read
- Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
- Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
- Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
ఆగస్ట్లో ‘గగన్యత్రి’ అంతరిక్ష యాత్ర..
నాసా, యాక్సియమ్ స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్ కోసం ఆర్డర్పై సంతకం చేసినట్లు ఇస్రో అధికారి తెలిపారు. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్ట్ 2024లోపు ప్రయోగించే అవకాశం ఉంది. ఇస్రో బోర్డు ఈ నలుగురు పైలట్లను ఎంపిక చేసింది. వీరంతా రష్యాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన ప్రాథమిక మాడ్యూల్స్పై శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా గగన్యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రోకు చెందిన ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. గగన్యాన్ శిక్షణా కార్యక్రమం మూడు సెమిస్టర్లలో రెండు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శిక్షణ కోసం అవసరమైన సిమ్యులేటర్లు, స్టాటిక్ మోకప్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లోని కొన్ని భాగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.. లోక్సభలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!