Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
- టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు
- వాట్సాప్ ఫీచర్పై ఇప్పటికే బ్రేక్
- ప్రభుత్వ ఆందోళన ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో WhatsApp తీసుకురావాలనుకున్న Username Feature ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఫీచర్ కారణంగా సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెటాకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశంపై Telegram, Signal వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్లకు కూడా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు పంపింది.
టెలిగ్రామ్, సిగ్నల్ను ఏమని ప్రశ్నించింది?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, యూజర్నేమ్ ఫీచర్ను కొనసాగించడానికి ఎందుకు అనుమతించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ముఖ్యంగా, యూజర్నేమ్లను ఉపయోగించి జరిగే నకిలీ గుర్తింపులు, ఫిషింగ్, ఆన్లైన్ మోసాలు వంటి సమస్యలను ఎలా అరికడుతున్నారో వివరించాలని టెలిగ్రామ్, సిగ్నల్ను కోరినట్లు సమాచారం.
Also Read
- Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- 8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
వాట్సాప్ ఫీచర్పై ఇప్పటికే బ్రేక్
WhatsApp తీసుకురావాలనుకున్న Username Feature ప్రారంభాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మొబైల్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాట్ చేసే వీలుంటుంది. అయితే, దీనివల్ల సైబర్ నేరాలు, ఫిషింగ్ దాడులు, డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాకు నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
ఇతర యాప్లపైనా దర్యాప్తు
WhatsApp వ్యవహారం తర్వాత ప్రభుత్వం తన పరిశీలనను ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్లకు కూడా విస్తరించింది. ఇప్పటికే Telegram, Signalలో యూజర్నేమ్ ఫీచర్ అందుబాటులో ఉండటంతో, ఆ ఫీచర్ దుర్వినియోగాన్ని ఎలా అరికడుతున్నారో వివరించాలని ఐటీ మంత్రిత్వ శాఖ లేఖలు పంపినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆందోళన ఏమిటి?
యూజర్నేమ్ల ద్వారా మోసగాళ్లు ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ప్రముఖ సంస్థలు లేదా ప్రముఖుల పేర్లతో పోలిన నకిలీ ఖాతాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో అమాయక ప్రజలు సులభంగా మోసపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. భద్రతాపరమైన చర్యలపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే వరకు ఈ తరహా ఫీచర్ల అమలుపై ప్రభుత్వం కఠిన వైఖరిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారతదేశమే WhatsAppకు అతిపెద్ద మార్కెట్
ప్రస్తుతం భారతదేశంలో 50 కోట్లకు పైగా WhatsApp వినియోగదారులు ఉన్నారు. అందువల్ల కొత్త ఫీచర్ల అమలు విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవసరమైతే ఐటీ చట్టం కింద చర్యలు కూడా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!