VI And BSNL: ఒకే గొడుగు కిందకు వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్..
- భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులు..
- ఒక్కటి కానున్న వొడాఫోన్ ఐడియా అండ్ బీఎస్ఎన్ఎల్..
- VIలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) , ప్రైవేట్ రంగంలోని వొడాఫోన్ ఐడియా (Vi) చేతులు కలపనున్నాయి. తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ రెండు సంస్థలు.. మార్కెట్లో తమ ఉనికిని చాటుకోవడానికి ఒకరి వనరులను మరొకరు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు తమ వద్ద ఉన్న టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ , స్పెక్ట్రమ్ను పంచుకోనున్నాయి. దీనివల్ల కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసే ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ‘కాస్ట్ సేవింగ్’ పద్ధతి రెండు కంపెనీలకు ఊపిరి పోయనుంది. ముఖ్యంగా నెట్వర్క్ విస్తరణకు అవసరమైన మూలధన వ్యయం తగ్గడం వల్ల, ఆ నిధులను సేవల నాణ్యత పెంచడానికి కేటాయించే అవకాశం ఉంటుంది.
Also Read
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
- BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
- Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
Also Read:TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..
బీఎస్ఎన్ఎల్కు కుగ్రామాల్లో ఉన్న పటిష్టమైన నెట్వర్క్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా పట్టణాల్లో Vi టెక్నాలజీ బీఎస్ఎన్ఎల్ కు తోడ్పడుతుంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవల్లో దూసుకుపోతుండగా.. వెనుకబడిన Vi , బీఎస్ఎన్ఎల్ లు ఈ భాగస్వామ్యంతో 5జీ నెట్వర్క్ను వేగంగా నిర్మించే అవకాశం ఉంది. దీని వల్ల టెలికాం రంగం కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పోటీ పెరగడం వల్ల కాల్ రేట్లు, డేటా ప్యాక్ల ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియాలో 49 శాతం వాటాను కలిగి ఉంది. అంటే ఒక రకంగా Vi కూడా ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తోంది. అటు పూర్తి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు, ఇటు ప్రభుత్వం వాటా ఉన్న Vi కి మధ్య సమన్వయం కుదరడం వల్ల టెలికాం రంగంలో ప్రభుత్వ ప్రాబల్యం పెరగనుంది. ప్రస్తుతం రెండు సంస్థలు 4జీ సైట్ల అప్గ్రేడేషన్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ కీలక సమయంలో ఇరు సంస్థలు ఏకమవ్వడం వల్ల టెక్నికల్ లోపాలు తగ్గి, కాల్ డ్రాప్స్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?