కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని షర్మిల విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దళితులకు రూ.10 లక్షలు కాదు, రూ.50 లక్షలు ఇవ్వాలని…
రాజన్న బిడ్డగా మా నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. షర్మిల దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నా అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారు. ఉద్యోగాలను వదిలేసి కుటుంబం కోసం ఆలోచిస్తుండు. వైఎస్సార్ గారు మాకు ప్రాణం. బతికున్నంత వరకూ వైఎస్సార్ మా గుండెల్లో ఉంటారు. మునుగోడు ప్రజలకు వైఎస్సార్ ఉదయ సముద్రం ప్రాజెక్టు కట్టించారు. ఆ ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు…
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు… క్రమంగా విమర్శల వాడి పెంచుతున్నారు.. ఇప్పటికే ఇందిరా పార్క్, లోటప్పాండ్ లో దీక్షలు చేసిన షర్మిల.. తాజాగా ఖమ్మం వేదికగా నిరుద్యోగ దీక్ష చేశారు.. ఇక, ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పాటించాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమంలో భాగంగా రాబోయే మంగళవారం (27వ తేదీ) ఉమ్మడి నల్గొండ…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… షర్మిల దీక్షపై స్పందించిన ఆయన.. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగంతో నిరాశ నిస్పృహలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేయడం అర్ధ రహితం అన్నారు.. మీ నాన్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన.. తన రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కరించులేక నిరుద్యోగ దీక్షలు చేపట్టారంటూ సెటైర్లు వేశారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం…
వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామానికి చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతిచెందిన నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం రోజుల రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి నిరుద్యోగ నిరాహార…
కాంగ్రెస్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నిన్నా..మొన్న పుట్టిందని… నడకలు కూడా ఆమెకు రాలేదని తెలిపారు. అప్పుడే పరుగులు పెడతా అంటే ప్రకృతికి విరుద్ధమని… పురుడు పోసుకున్నది మొన్ననేనని చురకలు అంటించారు. 9 నెలలు అయితే.. అడుగులు నేర్చుకోవచ్చన్నారు. ఆమె పై అంతకు మించి మాట్లాడేది ఏముండదని… కాంగ్రెస్ నాయకుడిగా వైఎస్ ని గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అంటే కొంత గౌరవం ఉండేదని…కానీ నిస్సిగ్గుగా మాట్లాడారని మండిపడ్డారు. read…
వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్ఆర్సిపి ఇంకా ప్రభావశీలంగా మారవలసే వుంది.విస్త్రత కార్యాచరణ చేపట్టవలసే వుంది.అయితే ఆమె వైఎస్రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, అంతకు మించి ఆమె అన్న జగన్మోహనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వుండటం వల్ల కావలసినంత ప్రచారం లబించడం సహజమే.అందుకు తోడు మీడియాలో ఒక భాగం ఆమె పార్టీ స్థాపనకు ముందునుంచే అమితంగా కథనాలు వదలడం, జగన్పై కోపంతోనే ఈ పార్టీ స్థాపిస్తున్నారని జోస్యాలు చెప్పడం ఆసక్తి పెంచింది.తెలంగాణలో పార్టీ పెట్టి ఎపి ముఖ్యమంత్రిపై…
వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల.. తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు.. పార్టీ జెండా, పేరు, అజెండా ప్రకటించిన తర్వాత ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. రేపు లొటస్పాండ్లో మీడియాతో మాట్లాడనున్నారు షర్మిల.. రాష్ట్ర స్థాయి కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.. జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పరిశీలకులను కూడా ప్రకటించనున్నారు.. మెంబర్ షిప్ డ్రైవ్, అక్టోబర్…
తెలంగాణలో ఇటీవలే కొత్తగా ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఈ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరుద్యోగ నిరాహర దీక్ష కొనసాగుతుంది. ఈరోజు వనపర్తి జిల్లాలోని తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. పీఆర్సీ ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, వెంటనే ఉద్యోగాలకు…