ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తులపై అప్పుడు పెద్ద చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో పొత్తులపై మాట్లాడిన బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపై పలు రకాల వార్తలు వస్తున్నాయి.. టీడీపీ, వైసీపీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని కార్యకర్తలకు స్పష్టం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పాలితులుగా ఉన్న వర్గాలను పాలకులుగా నియమించారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల నేతలు గతంలో రాజ్యాధికారం రావాలని ఉద్యమించారు.. సీఎం జగన్ విశాలభావం కారణంగా ఇప్పుడు మార్పు వచ్చిందన్నారు. ఒకలక్షా ఇరవై వేల కోట్లు పథకాలకు కేటాయించారని గుర్తుచేసిన ఆయన.. కమ్మర, కుమ్మరి, పొందర లాంటి కులాలు…
తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారు.. దీంతో, హిందూ మనోభావాలను కించ పరుస్తున్నారు.. వేంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలు గాయపడుతున్నాయని మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. కర్నూల్ జిల్లా ఆత్మకూరు, శ్రీశైలంలో, కాకినాడ జేఎన్టీయూలో, ఎమ్మెల్యే ద్వారంపూడి సహకారంతో మసీదు నిర్మాణం లాంటి పరిణామాలు చూస్తే ప్రభుత్వ తీరు అర్థం అవుతుందన్నారు.…
ఉన్నట్టుండి పెద్ద సంఖ్యలు నేతలు, కార్యకర్తలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చగా మారింది.. దీంతో, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇక, వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మేల్యే జక్కంపూడి రాజా సొంత నియోజకవర్గంలోని గాదరాడలో ఈ మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్గా మారిపోయింది.. Read Also: Astrology: మే 26, గురువారం దినఫలాలు గాదరాడ ఎంపీటీసీ బత్తుల వెంకట లక్ష్మి ఆధ్వర్యంలో 500…
కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. Konaseema: కోనసీమలో మళ్లీ మొదలైన టెన్షన్.. షాపులన్నీ క్లోజ్ అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను…
కోనసీమ జిల్లా మార్పు అంశంలో అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ కళ్యాణ్ చదివారని ఆమె ఆరోపించారు. కోనసీమ కోసం ఆత్మహత్య చేసుకుంటానన్న అన్యం సాయి అనే వ్యక్తి జనసేన కార్యకర్తేనని రోజా విమర్శలు చేశారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని గతంలో ప్రతిపక్షాలు అంగీకరించాయని ఆమె గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదని…
అమలాపురంలో అల్లర్లు జరిగిన విధానంపై పలు పార్టీల స్పందన చూస్తుంటే వాళ్లే కథంతా నడిపించారని అనుమానం కలుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమలాపురంలో దాడులకు కారణం వైసీపీ అని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ పార్టీలవి దుర్మార్గపు రాజకీయాలని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మంత్రి, తమ ఎమ్మెల్యే ఇళ్లపై తామే దాడులు చేయించుకుంటామా అని సజ్జల ప్రశ్నించారు. ఈ దాడులు కుట్రపూరితంగా పథకం ప్రకారమే జరిగాయని సజ్జల స్పష్టం…
ప్రజా ప్రతినిధులంతా ప్రజల వద్దకు వెళ్లేలా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలనుంచి ప్రజా ప్రతినిధులకు నిరసన తప్పడంలేదు, తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్ను నిలదీశారు ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ వచ్చాక అన్నీ ఇస్తున్నాడు.. కానీ, అన్ని ధరలు పెంచాడని ఆ వృద్ధురాలు నిలదీసింది ఆమె. Read Also: Nageswara Rao: ఆంధ్రప్రదేశ్ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..!…
వైసీపీ పాలకులు ప్రజలకు ఎలాగూ రక్షణ ఇవ్వరు.. కనీసం పోలీసులైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా…
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి.. తాజాగా, పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే జోగారావుకు నిరసన సెగ తగిలింది.. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లమనాయుడువలసలో పర్యటనకు వెళ్లిన పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావుకు గ్రామస్తుల నుంచి నిరసన ఎదురైంది.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి రాకుండా వైసీపీలోని మరో వర్గం అడ్డుపడింది.. అసలు గ్రామంలోకి రానివ్వకుండా ఎమ్మెల్యే జోగారావును వైసీపీలోని సర్పంచ్ వర్గీయులు అడ్డుకోవడం చర్చగా మారింది..…