వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అనర్హత వేటుపై రేపు విచారణ జరగనుంది. మండలి చైర్మన్ పంపించిన నోటీసులకు ప్రత్యక్షంగా హాజరై అఫిడవిట్ సమర్పించనున్నారు వంశీ. డిస్క్వాలిఫికేషన్ తనకు ఎందుకు వర్తించదో చెప్పేందుకు అవసరమైన సమాధానం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. రెబల్ ఎమ్మెల్సీ ఇచ్చే వివరణతో మండలి చైర్మన్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు ఖాయం అవుతుంది. ఒకవేళ అదే సాధ్యమైతే అనర్హత నిర్ణయాన్ని కోర్టులో చాలెంజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్.