వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది.. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు.. కానీ, నిద్ర నటించే వారిని ఏమీ చేయలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్నవాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.