ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ‘యూట్యూబ్’ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల ఆదాయాన్ని పెంచే దిశగా ‘షాపింగ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. దాంతో అర్హులైన క్రియేటర్లు తమ వీడియోలు, షార్ట్లు సహా లైవ్ స్ట్రీమ్లలో ఉత్పత్తులను ట్యాగ్ చేసి.. ఆదాయంను సంపాదించుకోవచ్చు. దీనికోసం ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్, మింత్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది. షాపింగ్ ప్రోగ్రామ్ను దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో యూట్యూబ్ గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల్ని మరిన్ని దేశాలకు విస్తృతం…