ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడుతుంది అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’. ధమ్ర పోర్ట్ కు సమీపంలో తీరాన్ని తాకిన అతి తీవ్ర తుఫాన్… మధ్యాహ్నం తర్వాత బాలాసోర్-ధమ్ర పోర్ట్ మధ్య తీరం దాటనుంది అతితీవ్ర తుఫాన్. 9 ఒడిషాజిల్లాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే అక్కడ రెడ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. ఈ తుఫాన్ కారణంగా బెంగాల్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ధమ్ర పోర్ట్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక…
యాస్ తుఫాను పై స్పందించిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ స్పందించింది. ఐఎండి సూచనల ప్రకారం… తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా కొనసాగుతున్న యాస్.. ఆ తరువాత 24 గంటల్లో అతితీవ్ర తుఫానుగా మారనుంది. పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు) కు ఉత్తరాన వాయువ్య దిశలో 620 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా) కి 530 కిలోమీటర్లు, బాలసోర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 630 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్) కి ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతం…