Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను హైదరాబాద్ మహా నగర్ అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ పాలకులను టెర్రరిస్టులు అంటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విధ్వేషాలు రగిల్చేలా మాట్లాడిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదును అందజేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ( TS REDCO) చైర్మన్గా నియమితులైన వై. సతీష్ రెడ్డి.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. తనను రాష్ట్ర రెడ్కో చైర్మన్గా నియమించినందకు ధన్యవాదాలు తెలిపారు.. కాగా, టీఎస్ రెడ్కో చైర్మన్గా వై సతీష్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుతం టీఆర్ఎస్…