Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఒక గ్రామంలో 14 మంది మైనర్ బాలికలు మణికట్టు కోసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లే బాలికల ఎడమచేతి మణికట్టుపై గాయాలు ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలికలంతా దండేలి ప్రాంతానికి, ఒకే పాఠశాలకు చెందిన 9,10 తరగతి విద్యార్థులే అని తేలింది. వారి మణికట్టుపై రేజర్ కోతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.