గోదావరి వరద ప్రవాహంతో ఇంటెక్ వెల్ లో చిక్కకున్న తమ ఆర్తనాదాలు పట్టించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరినది ఇంటెక్ వెల్ల లో చిక్కకున్న ఏడుగురు తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. సింగరేని సంస్థకు చెందిన ఐదుగురు ఉద్యోగులు బుధవారం (నిన్న) ఉదయం ఇంటెక్ వెల్ వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే.. అయితే ఈ క్రమమంలో గోదావరి ఉధృతి పెరగడంతో.. ఐదుగురు సింగరేణి కార్మికులు అక్కడే ఉండిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన…
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ లో రాజకీయాలు వేడెక్కాయి. జెడ్పి ఛైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి వాహనంపై ఎమ్మెల్యే ఆనంద్ అనుచరుల దాడి హాట్ టాపిక్ మారింది. అయితే.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పై ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించి.. తన వర్గంతో అడ్డుకున్నాడని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడైన…
వారికి వచ్చేదే అరకొర జీతం.. పైగా అది కూడా సమయానికి చేతికి అందదు.. మూడు మాసాల పెండింగ్.. తమకు జీతం పెంచాలని, దాన్ని సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నా స్పందన కరువు.. దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కుటుంబాన్ని నెట్టుకురాలేక అనేక అవస్థలు.. ఇదీ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికుల దుస్థితి. ఈ నేపథ్యంలో జీతాల కోసం నగరంలోని జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి GHMC కార్మికులు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ…
ఉదయాన్నే ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటోలు ఆపుతుంటారు. ఆటో ఆగిన తరువాత ఆటో డ్రైవర్తో మాట్లాడుతారు. ఆ తరువాత అందులోని వ్యక్తులను తీసుకొని వెళ్తారు. ఎవరు వారంతా, ఎందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానాలు రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో పొన్నారి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పత్తిపంట చేతికి వచ్చిన తరువాత పత్తిని తీసేందుకు కూలీల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల…
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చిందో అప్పటి నుంచే కార్మికులు, ఉద్యోగులు నిరసనబాట పట్టారు. వివిధ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు కార్మికుల నిరసనలకు మద్దతు ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం నేటికి 250 రోజులు పూర్తయింది. దీంతో ఈరోజు 250 మందితో25…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి కలిగినా ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తుల్లో ఉత్సాహం నింపేందుకు హెల్త్ వర్కర్లు వినూత్న ప్రయోగం చేశారు. కరోనా రోగుల ముందు డ్యాన్స్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ఈ…