WhatsApp Scam: అనకాపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా కోటిన్నర రూపాయలకు పైగా నష్టపోయాడు. గవరపాలెంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరగడం మహేంద్ర సూర్యకుమార్ ఈ సైబర్ మోసానికి బలైనట్టు పోలీసులు తెలిపారు.
Hyderabad Cybercrime Police: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల ప్రకటనల ప్రకారం.. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు.