బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. నేడు 3వ రోజు కూడా సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగనుంది. ఉత్తర్ ప్రదేశ్లో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని 14 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించనున్న సరయూ సహర్ జాతీయ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు నేడు అమరావతి రైతుల మహపాదయాత్ర…