Stock Market Roundup 03-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ లాభాలతో ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ని బలపరిచింది. లార్జ్ క్యాప్స్ అయిన ఎస్బీఐ, రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ మరియు భారతీ ఎయిర్టెల్ విశేషంగా రాణించాయి.