విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర గనుల శాఖ మంత్రి చెబుతుండగా, ప్లాంట్ ఆస్తుల విక్రయం చాపకింద నీరులా జరుగుతోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్ప్లాంట్ విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా మార్చి ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. తాజాగా, ఆర్ఐఎన్ఎల్కు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కార్యాలయ భవనాలు, యార్డు స్థలాలు రూ.475 కోట్లకు విక్రయించేందుకు అనుమతులు కోరారు. ఈ ఆస్తుల విక్రయంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని వివరాల కోసం…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నించింది. ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, కేంద్రం ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఏమి వెల్లడించారో తెలుసుకోవడం కొరకు కింది వీడియో చుడండి