Home
Visakhapatnam
Visakhapatnam News
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
విశాఖపట్నం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం “నెట్ జీరో” కార్యక్రమంలో భాగంగా సైకిల్పై ప్రయాణిస్తూ ఏయూ క్యాంపస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజశేఖర్కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. వందేళ్ల… -
Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
ముక్కుమోహం తెలియని వాళ్లు మన మీద దాడి చేస్తే భయపడతాం.. అదే పరిచయస్తులే దాడి చేసి ప్రాణాలు తీస్తే అమ్మో... ఊహించుకుంటునే భయంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. -
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధునిక పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ఊతాన్నిచ్చింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో రూ. 1,990.83 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రతిష్టాత్మక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ (UCF) కింద ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా… -
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, పర్యాటక స్వర్గధామం విశాఖపట్నం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన సముద్రపు గాలితో సేదతీర్చిన ఈ నగరం, నేడు విషతుల్యమైన బొగ్గు పొడితో నిండిపోతోంది. విశాఖ , గంగవరం పోర్టుల కార్యకలాపాలు నగరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అక్కడి కార్గో హ్యాండిలింగ్ , రవాణాలో జరుగుతున్న ఘోరమైన వైఫల్యాలు స్థానిక ప్రజల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. ప్రధానంగా ఓపెన్ యార్డ్లలో బొగ్గు, ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయడం వల్ల… -
Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విశాఖలో కలకలం రేపింది. ఈ ఏడాది మార్చి 6వ తేదీన పెళ్లి సమయంలో 28 లక్షల రూపాయల కట్నం, 19 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కానీ పెళ్లయిన మరుసటి రోజు నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు మృతురాలి బంధువులు. మానసికంగా శారీరకంగా పెట్టిన వేధింపులు తట్టుకోలేక నవవధువు తేజశ్రీ తనువు… -
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) మాస్టర్ ప్లాన్పై తుది విడత అభిప్రాయాలను సేకరించి, త్వరలోనే దానిని ఖరారు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. VMRDA మొత్తం పరిధి 6,836 చదరపు కిలోమీటర్లు ఉండగా, అందులో 4,387.36 చదరపు కిలోమీటర్ల మేర ‘2041 మాస్టర్ ప్లాన్’ ఇప్పటికే సిద్ధమైందని, మిగిలిన ప్రాంతానికి సంబంధించిన… -
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
Gudivada Amarnath: విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్కు పునాది YS. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పడిందని ఆయన స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు.… -
Padmam Silver Jewellery: విశాఖలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ ప్రారంభం.. ఆకర్షణీయ ఆఫర్ల ప్రకటన!
విశాఖపట్నంలో ‘పద్మం’ సిల్వర్ జువెలరీ మరో కొత్త శాఖను ఘనంగా ప్రారంభించారు. జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఈ నూతన షోరూమ్ను సీఎంఆర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్ శ్రీ మావూరి బాలాజీ, ఆయన సతీమణి శ్రీమతి హారికతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకలో మాట్లాడిన శ్రీ మావూరి బాలాజీ పద్మం సిల్వర్ జువెలరీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేలా… -
Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు సంభవించడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం రాత్రి సుమారు 11:35 గంటల సమయంలో అరకు వ్యాలీ పరిసరాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపినట్లు స్థానికులు… -
AP Crime: ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్లో పెట్టిన కేసులో ట్విస్ట్ .. వెలుగులోకి కీలక విషయాలు..!
AP Crime: విశాఖపట్నంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన ఈ ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.. పోలీసుల వివరాల ప్రకారం, నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న రవీంద్రకు మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ, పార్ట్టైమ్గా ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా పనిచేస్తోంది. ఈ పరిచయం తరువాత ఇద్దరి…
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!