Tragedy : దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను చంపిన కోడలు.. వివరాలు వెల్లడించిన ఏసీపీ
- విశాఖ పెందుర్తిలో అత్తను చంపిన కోడలు
- దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీలో తాళ్లతో బంధించిన కోడలు
- ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు
- దీపం అంటుకొని మృతి చెందినట్లు సీన్ క్రియేట్
- అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన కోడలు లలిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు లలిత తన అత్తను నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ అగ్ని ప్రమాదంలా చూపించేందుకు లలిత చేసిన నాటకాలు షాకింగ్గా మారాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. లలిత ముందుగా ‘దొంగ–పోలీస్ ఆట’ పేరుతో అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బింగించి కట్టేసింది. ఆ తరువాత క్రూరంగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. నిప్పు అంటుకున్న అత్త అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, లలిత దీనిని అగ్ని ప్రమాదం అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీపం అంటుకొని ప్రమాదవశాత్తు మరణించినట్లు సీన్ క్రియేట్ చేసి కుటుంబ సభ్యులు, పొరుగువారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన లలిత చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. పెందుర్తిలో జరిగిన ఈ షాకింగ్ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
అయితే..NTVతో వెస్ట్ ఏసీపీ పృథ్వితేజ మాట్లాడుతూ.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వృద్ధురాలు అనుమానస్పద మృతి కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామన్నారు. నిన్న ఉదయం అప్పన్నపాలెంలోని వర్షిని అపార్ట్మెంట్స్ లో ఓ వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయని సమాచారం వచ్చిందని, సంఘటన స్థలానికి వెళ్లి చూస్తే అనుమానాస్పదంగా ఉందని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసామన్నారు. మృతురాలు జయంతి మహాలక్ష్మి (63) కోడలే మాకు సమాచారం ఇచ్చారని, అత్త కళ్లకు గంతలు కట్టుకొని కుర్చీలో కాళ్లు చేతులు కట్టి దొంగ పోలీస్ ఆట ఆడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో నిందితురాలి కూతురుకు కాలిన గాయాలయ్యాయి. మేము ఆమె ఫోన్ స్వాధీనం చేసుకొని విచారించగా అందులో కీలక విషయాలు వెలుగు చూసాయన్నారు.
ఫోన్ లో ఒక వ్యక్తిని ఎలా చంపాలి? ఎలా తప్పించుకోవాలి అనే విధంగా సెర్చ్ చేసినట్లు గుర్తించామని, అత్తా కోడళ్ళకు గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయని, ప్లాన్ ప్రకారమే పెట్రోల్ బంకులో బాటిల్లో పెట్రోల్ పట్టుకొని ఇంటికి తీసుకువచ్చింది కోడలు.. మనవరాలుతో కలిసి ఈ ఆట ఆడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది.. అత్త పెట్టిన వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది.. నిందితురాలను రిమాండ్ కు తరలిస్తామని ఏసీపీ తెలిపారు.
SEBI: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. రూ.10కి బంగారం కొనేవారికి సెబీ తీవ్ర హెచ్చరిక
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!