Tragedy : దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను చంపిన కోడలు.. వివరాలు వెల్లడించిన ఏసీపీ
- విశాఖ పెందుర్తిలో అత్తను చంపిన కోడలు
- దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీలో తాళ్లతో బంధించిన కోడలు
- ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు
- దీపం అంటుకొని మృతి చెందినట్లు సీన్ క్రియేట్
- అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన కోడలు లలిత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు లలిత తన అత్తను నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ అగ్ని ప్రమాదంలా చూపించేందుకు లలిత చేసిన నాటకాలు షాకింగ్గా మారాయి.
పోలీసుల సమాచారం ప్రకారం.. లలిత ముందుగా ‘దొంగ–పోలీస్ ఆట’ పేరుతో అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బింగించి కట్టేసింది. ఆ తరువాత క్రూరంగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. నిప్పు అంటుకున్న అత్త అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, లలిత దీనిని అగ్ని ప్రమాదం అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీపం అంటుకొని ప్రమాదవశాత్తు మరణించినట్లు సీన్ క్రియేట్ చేసి కుటుంబ సభ్యులు, పొరుగువారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన లలిత చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. పెందుర్తిలో జరిగిన ఈ షాకింగ్ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read
అయితే..NTVతో వెస్ట్ ఏసీపీ పృథ్వితేజ మాట్లాడుతూ.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న వృద్ధురాలు అనుమానస్పద మృతి కేసును గంటల వ్యవధిలోనే ఛేదించామన్నారు. నిన్న ఉదయం అప్పన్నపాలెంలోని వర్షిని అపార్ట్మెంట్స్ లో ఓ వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయని సమాచారం వచ్చిందని, సంఘటన స్థలానికి వెళ్లి చూస్తే అనుమానాస్పదంగా ఉందని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసామన్నారు. మృతురాలు జయంతి మహాలక్ష్మి (63) కోడలే మాకు సమాచారం ఇచ్చారని, అత్త కళ్లకు గంతలు కట్టుకొని కుర్చీలో కాళ్లు చేతులు కట్టి దొంగ పోలీస్ ఆట ఆడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. ఈ ప్రమాదంలో నిందితురాలి కూతురుకు కాలిన గాయాలయ్యాయి. మేము ఆమె ఫోన్ స్వాధీనం చేసుకొని విచారించగా అందులో కీలక విషయాలు వెలుగు చూసాయన్నారు.
ఫోన్ లో ఒక వ్యక్తిని ఎలా చంపాలి? ఎలా తప్పించుకోవాలి అనే విధంగా సెర్చ్ చేసినట్లు గుర్తించామని, అత్తా కోడళ్ళకు గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయని, ప్లాన్ ప్రకారమే పెట్రోల్ బంకులో బాటిల్లో పెట్రోల్ పట్టుకొని ఇంటికి తీసుకువచ్చింది కోడలు.. మనవరాలుతో కలిసి ఈ ఆట ఆడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది.. అత్త పెట్టిన వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది.. నిందితురాలను రిమాండ్ కు తరలిస్తామని ఏసీపీ తెలిపారు.
SEBI: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. రూ.10కి బంగారం కొనేవారికి సెబీ తీవ్ర హెచ్చరిక
తాజావార్తలు
-
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
-
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?