US-Israeli war: పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. హర్మూస్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా, విశాఖ పోర్టు నుండి ఎగుమతి అయిన వేలాది కంటైనర్లు తమ గమ్యస్థానాలకు చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదకరమని భావించిన అధికారులు, నౌకలను తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. విశాఖ పోర్టు చరిత్రలోనే ఎగుమతి అయిన సరుకు ఈ స్థాయిలో రివర్స్ రావడం ఇదే మొదటిసారి. Dhurandhar 2 Telugu Trailer:…
Minister BC Janardhan Reddy: శాసన మండలిలో పోర్టుల అంశంపై ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద రవిచంద్ర ప్రశ్నించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.. ఇందులో కీలక సమాచారం వెల్లడించారు. రాష్ట్రంలోని ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తోందని.. నాన్-మేజర్ పోర్ట్ లు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు మారిటైమ్…
Nara Lokesh: పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని ట్రాఫిగురా సీఈవో సచిన్గుప్తాను మంత్రి లోకేష్ కోరారు. విశాఖ, కాకినాడ పోర్టుల్లో అధునాతన వేర్హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం కావాలని సచిన్గుప్తాను కోరారు.ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్లాట్ ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ (లీజింగ్) ప్రకృత్ మెహతాతో…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
వైజాగ్ పోర్టు డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25 వేల టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. కంటైనర్ షిప్లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో నిర్ధారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ అని నిర్ధారణ అయింది.కోర్టుకు ఇదే సమాచారాన్ని సీబీఐ ఇచ్చింది.
CBI, drugs, shipping container, Visakhapatnam Port, Andhra Pradesh, Central Bureau of Investigation, Operation Garuda, International Drug Operation, Brazil, Narcotics,
విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఏకంగా 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ ధరతో పోలిస్తే.. తక్కువ ధరకు లభిస్తున్న దేశీయ బొగ్గు లభిస్తుండడంతో విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బొగ్గు ధరలలో వ్యత్యాసం కారణంగా కొనుగోళ్లు ఆగిపోయాయి.