US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలోనే తొలిసారి.. నడి సముద్రం నుండి వెనక్కి 10,000 కంటైనర్లు.!
- హర్మూస్ జలసంధి ఉద్రిక్తతలతో ఆగిపోయిన నౌకలు
- విశాఖ పోర్టుకు తిరిగి వస్తున్న 10,000 కంటైనర్లు
- ఎగుమతిదారులకు భారీ నిర్వహణ ఖర్చుల భారం
- సీఫుడ్ , ఫార్మా ఎగుమతులపై నాణ్యత ఆందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Israeli war: పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. హర్మూస్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా, విశాఖ పోర్టు నుండి ఎగుమతి అయిన వేలాది కంటైనర్లు తమ గమ్యస్థానాలకు చేరలేక మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదకరమని భావించిన అధికారులు, నౌకలను తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. విశాఖ పోర్టు చరిత్రలోనే ఎగుమతి అయిన సరుకు ఈ స్థాయిలో రివర్స్ రావడం ఇదే మొదటిసారి.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సుమారు 10,000 కంటైనర్లు తిరిగి విశాఖ తీరానికి చేరుకోనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ నుండి ప్రధానంగా సీఫుడ్ (రొయ్యలు, చేపలు), ఫార్మా ఉత్పత్తులు, , జీడిపప్పు వంటి విలువైన సరుకులు ఎగుమతి అవుతుంటాయి. ఈ సరుకులు పాడవకుండా ఉండాలంటే వాటిని నిరంతరం శీతలీకరణ యంత్రాల్లో (Refrigerated Containers) ఉంచాలి. అయితే, వీటిని యార్డుల్లో భద్రపరచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో కంటైనర్కు రోజుకు సుమారు ₹5,000 వరకు విద్యుత్ బిల్లు అయ్యే అవకాశం ఉందని లెక్కగట్టారు. దీనివల్ల వచ్చే లాభం కంటే నిర్వహణ ఖర్చే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
ఒకేసారి వేల సంఖ్యలో కంటైనర్లు తిరిగి వస్తుండటంతో పోర్టులో స్థల కొరత ఏర్పడింది. ఈ కంటైనర్లను ఉంచడానికి కనీసం 16,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ టెర్మినల్ అధికారులు పోర్ట్ ట్రస్ట్కు లేఖ రాశారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవడానికి కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎగుమతిదారులు , టెర్మినల్ నిర్వాహకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా ఎగుమతి అయ్యే సరుకుపై ఉండే నిబంధనలు, తిరిగి వచ్చే సరుకుకు వర్తించవు కాబట్టి, కస్టమ్స్ విభాగం కొత్త గైడ్లైన్స్ను రూపొందించే పనిలో పడింది.
ఎగుమతిదారుల ప్రధాన ఆందోళన సరుకు నాణ్యతపైనే ఉంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులను 3 నుండి 5 రోజులకు మించి నిల్వ చేయడం కష్టసాధ్యం. నౌక ప్రయాణంలో ఉన్నప్పుడు ఉండే అత్యాధునిక ప్రిజర్వేషన్ సౌకర్యాలు, పోర్టులోని యార్డుల్లో ఉండకపోవచ్చు. దీనివల్ల వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ఉత్పత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం కారణంగా అరేబియా సముద్రం , గల్ఫ్ దేశాల వైపు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం, ఈ ఎగుమతులకు మోక్షం లభించేలా కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Delimitation: TMC ఎఫెక్ట్.. నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్! మ్యాజిక్ ఫిగర్ను NDA ఎలా సాధించబోతోంది?
-
Anupama Singh: “మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది”.. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్
ట్రెండింగ్
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!