జార్ఖండ్లో రైల్వే సేవను మనుషులు మాత్రమే కాకుండా జంతువులు వినియోగించుకుంటున్నాయి. ఆశ్చర్యపోకండి! ఇది నిజం. జార్ఖండ్లోని సిల్లి స్టేషన్ నుంచి ఖరగ్పూర్-రాంచీ లోకల్ రైలులో ఒక కోతి(లంగూర్) ఎక్కింది. సాధారణ ప్రయాణికులతో కలిసి జర్నీ చేసింది. కానీ మనుషుల్లాగే ఈ కోతి విండో సీటు తీసుకుందండోయ్.. ఏ ప్రయాణీకుడికి హాని కలిగించకుండా విండో సీటుపై కూర్చుని రాంచీ స్టేషన్కు చేరుకుంది. స్టేషన్లో కిందికి దిగి ఎక్కడికో వెళ్లిపోయింది.