తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కంచంలో చికెన్ ముక్క కనిపించడం కాస్త భారంగానే మారేలా ఉంది. ఆదివారానికి ఒక్క రోజు ముందుగానే చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కిలో రూ.330 పలికిన చికెన్, ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి రూ.80 వరకు పెరిగి సామాన్యుడి బడ్జెట్కు చిల్లు పెడుతోంది. ప్రస్తుతం…