JK Elections: పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్లో నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370ని తొలగించి, లడఖ్ను విభజించిన తదుపరి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ఇది మొదటి ఎన్నికలు. ఈరోజు (బుధవారం) న మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకు గాను బరిలో 219 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్ల వద్ద…