తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు కోనసాగుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర, సరుకు, అంబులెన్స్ కు…
సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు వద్దా తెలంగాణ- ఆంధ్రా అంతరాష్ట్ర సరిహద్దులో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. తెలంగాణలోకి రావాలంటే లాక్ డౌన్ మినహాయింపు సమయంలో కూడా ఈ-పాస్ ఉన్న వారినే పంపిస్తున్నారు పోలీసులు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేకపోవడంతో చాలా వాహనాలు నిలిపివేస్తున్నారు పోలీసులు. బైక్, ఆటోలతోసహ అన్ని వాహనాలను నిలిపివేయడంతో భారీగా నిలిచిపోయాయి వాహనాలు. అయితే నిన్నటి నుండి రాష్ట్రంలో ఆంక్షలు మరింత…