Stones On Vande Bharat Train: లక్నో నుంచి పాట్నా వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (22346)పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వారణాసి పరిసరాల్లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో నిందితులు రాళ్లు రువ్వి రైలు సీ5 కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారని రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం.. వందేభారత్ రైలు నంబర్ 22346పై రాళ్లు రువ్వబడ్డాయి.…
ఒక ఈవ్టీజర్కు నడిరోడ్డుపైనే ఇద్దరు యువతులు బుద్ధి చెప్పారు. కారులో వెళ్తుండగా బుల్లెట్ రైడర్ వేడిపించాడు. అంతే అతగాడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. కారు ఆపి.. యువకుడ్ని అడ్డుకున్నారు. దిగి దిగగానే ఈవ్టీజర్ చెంపలు వాయించారు. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు మొబైల్లో ఈ సీన్ను చిత్రీకరించాడు.
Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో ఉన్న జ్ఞానవాపిలో వివాదాస్పద కట్టడమైన ప్రధాన గోపురం కింద ఏఎస్ఐ విచారణ జరిపించాలని వదామిత్ర డిమాండ్ చేస్తుంది.
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్లో జరుగుతున్న ‘కన్వర్ యాత్ర’ వివాదాస్పదంగా మారింది. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాలు, ఇతర దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని ఇటీవల ముజఫర్నగర్ జిల్లా పోలీసులు ఆదేశించారు.
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Coin Stuck In Man's Windpipe: బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్యూ)లోని శ్రీ సుందర్లాల్ హాస్పిటర్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 8 ఏళ్లుగా 40 ఏళ్ల వ్యక్తి శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన 25 పైసల నాణేన్ని తొలగించారు.
PM Modi Security Breach: ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇటీవల వారణాసిలో పర్యటించేందుకు ప్రధాని మోడీ వెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా వైఫల్యం జరిగింది. ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ రద్దీగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు కాన్వాయ్పైకి చెప్పులు విసిరారు.
మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. వారణాసిలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రూ.20,000 కోట్లను విడుదల చేశారు. ఈ విడతలో 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు క్రిడిట్ అవుతాయి.
Rahul Gandhi: తన సోదరి ప్రియాంకాగాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్రమోడీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించేవారని మంగళవారం రాహుల్ గాంధీ అన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత హాట్స్టేట్ సీట్లలో ఒకటైన వారణాసి సీటు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి మూడోసారి గెలుపొందారు. కాగా.. ఈరోజు వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత.. పుంజుకోగా 1.5 లక్షలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.