Namo Bharat Rapid Rail: భారత రైల్వేలు అధునాతనంగా మారుతున్నాయి. ఇప్పటికే పట్టాలపై వందేభారత్ సెమీ హై స్పీడ్ ట్రైన్ పరుగులు తీస్తోంది. మరోవైపు వందే భారత్ స్లీపర్ ట్రైన్ని ప్రారంభించేందు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ‘‘వందే మెట్రో రైలు’’ని ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
రోజువారీ రైల్వే ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే వందే మెట్రో రైలును నడపనుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెట్రో మార్గంలో నడిచే ఈ రైళ్లు మొదటి దశలో దేశంలోని 124 నగరాలను కలుపుతాయి. జూలై నుంచి తొలి వందే మెట్రో రైలు పట్టాలపై నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.