Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం ముదురుతోంది. సైన్యం, పారామిలిటరీ మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. సైన్యంలో పారామిలిటీరిన విలీనం చేసేందుకు సైన్యాధ్యక్షుడు ప్రతిపాదించడంతో, పారామిలిటీరి కమాండర్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రహింస చెలరేగింది. రాజధాని ఖార్టూమ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఘర్షణలు పాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులందరికి సూచనలు జారీ చేసింది. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
ఉపాధి కోసం విదేశీలకు వెళ్లిన భారతీయులు జైలు పాలవుతున్నారు. విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల సంఖ్య భారీగా ఉంది. తెలిసో తెలియకో చేసిన తప్పులకు జైళ్లలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం విదేశీ జైళ్లలో మొత్తం 8,437 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.