Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి
Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం ముదురుతోంది. సైన్యం, పారామిలిటరీ మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. సైన్యంలో పారామిలిటీరిన విలీనం చేసేందుకు సైన్యాధ్యక్షుడు ప్రతిపాదించడంతో, పారామిలిటీరి కమాండర్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రహింస చెలరేగింది. రాజధాని ఖార్టూమ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఘర్షణలు పాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులందరికి సూచనలు జారీ చేసింది. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
Read Also: Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి
Also Read
ఇదిలా ఉంటే ఖార్టూమ్ లో జరిగిన దాడుల్లో కేరళ వాసి మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆల్బర్ట్ అగెస్తీన్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందజేస్తామని, అతని మృతదేహాన్ని దేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. బాధితుడి తండ్రితో కూడా మంత్రి మాట్లాడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అగెస్తీన్ బుల్లెట్ గాయాలతో చనిపోగా అతని భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారని రాయబార కార్యాలయం తెలిపింది. కెనడాలో ఉన్న తన కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో అగెస్తీన్ బుల్లెట్ గాయాలయ్యాని కేరళలోని అతని బంధువులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు అతను తన ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. సుడాన్లోని దాల్ గ్రూప్ కంపెనీలో అగెస్టీన్ పనిచేస్తున్నాడు. కేరళ పీసీసీ చీఫ్ కే సుధాకరన్ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. అగస్తీన్ మృతదేహాన్ని త్వరగా భారత్ తీసుకువచ్చేలా చూడాలని కోరారు. ప్రస్తుతం అధికార లెక్కల ప్రకారం సూడాన్ దేశంలో 4000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో దశాబ్ధాల క్రితం దేశంలో స్థిరపడిన వారు 1200 మంది ఉన్నారు. అక్టోబర్ 2021లో జరిగిన తిరుగుబాటులో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజాస్వామ్యం వైపు తీసుకుని వెళ్లే క్రమంలో చర్చల్లో భాగంగా సైన్యం, పారామిలిటరీల మధ్య వివాదం రాజుకుంది.
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!