Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం ముదురుతోంది. సైన్యం, పారామిలిటరీ మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. సైన్యంలో పారామిలిటీరిన విలీనం చేసేందుకు సైన్యాధ్యక్షుడు ప్రతిపాదించడంతో, పారామిలిటీరి కమాండర్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రహింస చెలరేగింది. రాజధాని ఖార్టూమ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఘర్షణలు పాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులందరికి సూచనలు జారీ చేసింది. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
Read Also: Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
ఇదిలా ఉంటే ఖార్టూమ్ లో జరిగిన దాడుల్లో కేరళ వాసి మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆల్బర్ట్ అగెస్తీన్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందజేస్తామని, అతని మృతదేహాన్ని దేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. బాధితుడి తండ్రితో కూడా మంత్రి మాట్లాడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అగెస్తీన్ బుల్లెట్ గాయాలతో చనిపోగా అతని భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారని రాయబార కార్యాలయం తెలిపింది. కెనడాలో ఉన్న తన కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో అగెస్తీన్ బుల్లెట్ గాయాలయ్యాని కేరళలోని అతని బంధువులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు అతను తన ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. సుడాన్లోని దాల్ గ్రూప్ కంపెనీలో అగెస్టీన్ పనిచేస్తున్నాడు. కేరళ పీసీసీ చీఫ్ కే సుధాకరన్ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. అగస్తీన్ మృతదేహాన్ని త్వరగా భారత్ తీసుకువచ్చేలా చూడాలని కోరారు. ప్రస్తుతం అధికార లెక్కల ప్రకారం సూడాన్ దేశంలో 4000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో దశాబ్ధాల క్రితం దేశంలో స్థిరపడిన వారు 1200 మంది ఉన్నారు. అక్టోబర్ 2021లో జరిగిన తిరుగుబాటులో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజాస్వామ్యం వైపు తీసుకుని వెళ్లే క్రమంలో చర్చల్లో భాగంగా సైన్యం, పారామిలిటరీల మధ్య వివాదం రాజుకుంది.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?