India on Russian oil: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్లు రాజకీయ ఒత్తిడితో కాకుండా, ఖర్చులు, లభ్యత, ప్రమాదాలను బట్టి జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడిన జైశంకర్.. అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినా.. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మారదని స్పష్టం చేశారు.
US:రష్యన్ చమురును కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. మాస్కో ఇంధన రంగంపై అమెరికా విధించిన తాజా ఆంక్షల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. శనివారం మ్యూనిచ్ భద్రతా సమావేశంలో రూబియో చెప్పినట్లు మీడియా నివేదించింది.
Donald Trump: రాబోయే 50 రోజుల్లో ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించకపోతే రష్యాపై "తీవ్రమైన సుంకాలు" విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. ‘‘మేము సెకండరీ టారిఫ్లు అమలు చేయబోతున్నాం. 50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే, అవి 100 శాతం ఉంటాయి.’’ అని సోమవారం వైట్హౌజ్లో విలేకరులతో ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ ఆపకపోవడంపై ట్రంప్ చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.