రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్-అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య జరిగిన ‘పాకిస్థాన్ అణ్వాయుధ’ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్స్క్రిప్ట్లను నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అణ్వాయుధాలపై ఇరువురి నేతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసినట్లుగా పత్రాల్లో వెల్లడయ్యాయి.