India: మతస్వేచ్ఛపై అమెరికాకు చెందిన సంస్థ ఇచ్చిన రిపోర్టుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) యొక్క తాజా నివేదికని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నివేదికపై విదేశాంగ మంత్రిత్వ శఆఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. భారతదేశం గురించి వాస్తవాలను తప్పుగా చూపిస్తోందని, ఇది ‘‘ప్రేరేపిత కథనాన్ని’’ ప్రోత్సహిస్తోందని అన్నారు.