యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లకు చోటు దక్కింది. అంతేకాకుండా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుండేలాల రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో చేర్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు.