టీవీ ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలపై సీరియస్ అయ్యింది సుప్రీంకోర్టు.. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, విద్వేష ప్రసంగాలను సహించేదిలేదని పేర్కొంది.. అయితే, అలాంటి వాటిని ఆపాల్సిన బాధ్యత టీవీ యాంకర్లదేనని స్పష్టం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకుడిగా ఎందుకు మిగిలిపోయింది అని ప్రశ్నించింది.. ద్వేషపూరిత ప్రసంగాలపై టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు యాంకర్ పాత్ర చాలా ముఖ్యమైనది అని పేర్కొంది. Read Also: Chhello show: ఆ…
టీవీలో ఒక సీరియల్ ప్రసారం కావడం మొదలుపెడితే నెలలు కాదు సంవత్సరాల తరబడి సాగుతుంటాయి. ఇక ఇప్పుడు వస్తున్న సీరియళ్ళు కాస్త శృతిమించిపోతున్నాయి. సినిమాల్లో ఉన్నట్టుగానే ప్రేమలు, ముద్దులు వంటివి కనిపిస్తున్నాయి. సీరియళ్ల ప్రభావం యువతపైన, కుటుంబాలపైన అధికంగా ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం ఈ సీరియళ్ల వ్యవహారంపై దృష్టిసారించింది. టీవీ సీరియళ్లలో ఇక నుంచి కౌగిలింతలు, ఇతరత్రా సన్నిహిత దృశ్యాలు వంటివి ఉండకూడదని, అలాంటి వాటికి ప్రసారం చేయడం నిలిపివేయాలని పీఈఎంఆర్ఏ టీవీ ఛాలళ్లకు ఆదేశాలు…