Turkey Earthquakes: భారీ భూకంపాల ధాటికి టర్కీ కుదేలైంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 11,200 మందికి పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచదేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇండియా కూడా తన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఇతర వైద్య సహాయాన్ని టర్కీకి పంపింది.