ఖమ్మం జిల్లా బీసీ నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఉద్దేశించి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు.
రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలకు చేరే విధంగా మేము పోరాటం చేస్తున్నాం.. దోచుకోవడం కోసం కొందరు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి కానీ, తెలంగాణలో అది లేదు.. అధికారంలోకి వచ్చి డబ్బు, మద్యం, అధికారం అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారు అంటూ భట్టి విక్రమార్క అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ నేతలు తుమ్మలతో సమావేశమయ్యారు. breaking news, latest news, telugu news, big news, tummala nageswara rao, congress
Tummala Nageswara Rao: తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ఖమ్మం వస్తున్న తమ నేతకు ఘనస్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు.
Renuka Chowdhury: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి స్వాగతం పలుకుతామన్నారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సీట్ల వివాదం కొనసాగుతుంది. పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి పోటీ చేయాలని ఆయన అనుచర వర్గం ప్రత్యేకంగా రహస్య సమావేశం అయింది.