CM Revanth Reddy: గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు.…
రాష్ట్రంలో త్వరలో వెలువడనున్న కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు OTR అప్డేట్ అనేది ప్రాథమిక అర్హతగా మారింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ వద్ద సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థుల డేటా ఉంది, అయితే మారుతున్న నిబంధనలు , అభ్యర్థుల విద్యా అర్హతలను దృష్టిలో ఉంచుకుని ఈ డేటాను కమిషన్ క్రమబద్ధీకరిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ (Scheduled Castes categorization) వంటి ఇటీవలి మార్పులు , అభ్యర్థుల తాజా విద్యార్హతల ఆధారంగా నోటిఫికేషన్ల ప్రక్రియను పారదర్శకంగా…