బంగారం ధర చుక్కలనంటుతోంది. దీంతో స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 15 లక్షల విలువ చేసే 300 గ్రాముల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దానిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా సినీ ఫక్కీలో బంగారాన్ని చిన్నారులు ఆడుకునే టాయ్…