ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుత రోజుల్లో కారు వినియోగం అనేది సర్వ సాధారణంగా మారింది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు అవసరాలు, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరడం కోసం ప్రతి ఒక్కరూ కారును వాడుతున్నారు. మైలేజీ బాగా వచ్చినప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది. అయితే.. వేసవి కాలం వచ్చిందంటే చాలు కార్లలో మైలేజ్ తగ్గుతుంది.