పురచ్చి తలైవి జయలలితను అమ్మగా ఆరాధించే తమిళులు అధికం. భారతదేశ సినీ, రాజకీయ చరిత్రలో నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలితది ఓ ప్రత్యేక అధ్యాయం. ఆమె మరణానంతరం బయోపిక్స్ రూపొందించాలని చాలా మంది ప్రయత్నించారు. అందులో రమ్యకృష్ణ నాయికగా ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ సీజన్ 1 వచ్చింది. నిత్యామీనన్ సైతం జయలలిత బయోపిక్ లో నటించబోతోంది. ఇదిలా ఉంటే… కంగనా రౌనత్ నాయికగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విష్ణు వర్థన్, శైలేష్ సింగ్ నిర్మించిన ‘తలైవి’…