Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Nimmala Ramanaidu Alleged That The Previous Government Had Left The Management Of The Projects Up To The Wind

Nimmala Ramanaidu: ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..

Published Date :July 5, 2024 , 5:25 pm
By Rajesh Veeramalla
  • ఇరిగేషన్ సీఈ.. ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేెశం
  • జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయి- నిమ్మల
  • ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది
  • జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు.. గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి
  • గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి- నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu: ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం అంచనాలు వేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం కాల్వల్లో సిల్ట్ తీయలేదు.. తట్ట మట్టి కూడా ఎత్తలేదు.. జగన్ నిర్వాకం వల్ల వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీసిల్టింగ్ పనులకు అంచనాలు రూపొందించాలని సూచించాం.. పట్టిసీమ నిర్వహణ లేకపోవడం వల్ల పంపులు ఆన్ చేయగానే కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.

కృష్ణా డెల్టాకు సాగు నీరు సమస్య ఉంది.. సాగర్ ఆయకట్టులోని రైతులకు ఇబ్బందులున్నాయని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే గోదావరి జలాలు తప్పని సరి అవుతోంది.. కృష్ణా నదిలో సరైన ఇన్ ఫ్లో ఉండడం లేదు.. పులిచింతలలో కేవలం అర టీఎంసీ నీటి నిల్వ కూడా లేకుండా పోయిందని అన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణాకు తాగు నీటి సమస్య కూడా వస్తోందని తెలిపారు. పట్టిసీమ లేకుంటే కృష్ణా ప్రజలు దాహార్తితో ఎండిపోయే పరిస్థితి వచ్చేది.. పోలవరంతో పాటు ఏపీలోని ప్రతి ప్రాజెక్టూ 20 ఏళ్ల వెనక్కు వెళ్లిపోయాయని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు కోసం కొంత మేర ఖర్చు పెట్టినా.. వాటిల్లో సగం నిధులు వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయని అన్నారు. ఐదేళ్లూ సరైన పని లేక అధికారుల్లో నిర్లిప్తిత కన్పిస్తోందని చెప్పారు.

Also Read

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
  • Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
  • Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్‌డేట్ అదిరిపోయింది..!
  • NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?

ప్రజా ప్రభుత్వం రావడంలో ఉద్యోగుల పాత్ర కూడా ఉందని మంత్రి నిమ్మల తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులూ సహకరించాలని కోరుతున్నామన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ విషయంలో విదేశీ నిపుణులు నెలలో 10 రోజులు పరీక్షలు జరపాలి..
ప్రాజెక్టు సేఫ్టీ ముఖ్యం కాబట్టి.. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని దాదాపు నిర్ణయించామన్నారు. డయాఫ్రం వాల్ కు రిపేర్లు చేయొచ్చనే ప్రతిపాదనలూ ఉన్నాయి.. అన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన ఖర్చును భరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పట్టిసీమ పంపుల నుంచి నీటి విడుదల ప్రణాళికా బద్దంగా చేస్తున్నామని.. 15 పంపుల నుంచి నీటి విడుదల చేస్తున్నాం.. రెండు పంపుల్లో ప్రాబ్లం వచ్చిందని తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో 21 పంపులూ వదులుతాం.. కాల్వగట్లను పటిష్టం చేయాలని సూచించాం.. గండ్లు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించామని మంత్రి నిమ్మల చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Irrigation CE
  • Meeting
  • Minister Nimmala Ramanaidu
  • projects
  • SE

తాజావార్తలు

  • Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

  • Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!

  • Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్‌డేట్ అదిరిపోయింది..!

  • Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్‌లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions