పూజా హెగ్డే పరిస్థితి తారుమారైంది. వరుసగా ఆరో ప్లాప్ ను ఆమె తన ఖాతాలో వేసుకుంది. పూజా లేటెస్ట్ రిలీజ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయం నేపథ్యంలో పూజా డిప్రెషన్ కి గురయినట్లు సమాచారం.
ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఒకే టికెట్పై రెండు బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.