తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1417 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 610834 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1897 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3546 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19029 యాక్టివ్ కేసులు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత మెరుగుపరిచేందుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కమిటీ బిఆర్కె భవన్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్పత్రికి సకాలంలో రాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్నీ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. రాష్ట్రంలో వైద్య సేవల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని కూడా సూచించింది.…
టీఆర్ఎస్లోని ఆ సీనియర్ నేతకు మళ్లీ పదవీయోగం ఉందా? ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కించుకుంటారా? ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఫైర్ కావడం వెనక కారణం అదేనా? ఎమ్మెల్సీ పదవిపై అధిష్ఠానం హామీ దక్కిందా లేదా? కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారా? తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ…
తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకున్నది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీని నియమించాల్సి ఉన్నా, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని వాయిదా వేశారు. కాగా, ఈరోజు ఢిల్లీలో తెలంగాణ పీసీసీ నియామకంపై సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరయ్యారు. ఏ క్షణమైనా టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నది. టీపీసీసీ రేస్లో ఉన్న రేవంత్ రెడ్డి…
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కీలక భేటీ నిర్వహించనుంది కాంగ్రెస్ అధిష్టానం. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది.…
హుజూరాబాద్ ప్రజలంతా ఈటల రాజేందర్కు గోడి కట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్.. హుజురాబాద్లో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని వెల్లడించారు.. అయితే, వాపును చూసి ఈటల బలుపుగా భావిస్తున్నారంటూ సెటైర్లు వేశారు గంగుల… రాబోవు ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గోరి ఎందుకు ఎట్టాలో ఈటల చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. రైతు బంధుకు చెక్ తీసుకుని…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకముందే.. మరోవైపు థర్డ్ వే భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. అయితే, థర్డ్ వేవ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడదని సూచించారు.. ఇవాళ హైదరాబాద్లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోందన్నారు.. యూరప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు…
లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల నుంచి 300 కోట్ల రూపాయలు కొట్టేయాలని ప్లాన్ చేసారు.టైల్ బేసిక్ లో కలకత్తా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కోటి 18 లక్షల రూపాయలు డ్రా చేసారు నిర్వాహకులు. లోన్ యాప్ ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ చెందిన అనిల్ నల్లమోతు ద్వారా డబ్బులను డిపి చేసారు చైనా కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ పోలీసులు పేరుతో బ్యాంకులను బెదిరించిన అనిల్…
తాజాగా టీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాస్త వెనుకో ముందు ఉప ఎన్నికలు జరగనుండడంతో.. నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి.. ఇంటికి వెళ్లి అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇదే సమయంలో.. మరికొంతమంది నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. పనిలో పనిగా.. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్ సభ…