BRS MLCs Suspended: శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెన్షన్ చేశారు. ఒకరోజు పాటు మండలి నుంచి సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ జరిగింది.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. ఛైర్మన్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై మండలి ఛైర్మన్ ఆగ్రహం…
Bandi Sanjay: కవిత పార్టీ పెట్టడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ప్రజలకు ఉపయోగ పడితే ఆ ఆ పార్టీలను వారు స్వాగతిస్తారన్నారు. తాజాగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు గుడ్లు గుర్తుకు వస్తాయి. గాడిద గుడ్లు అంటారు. ఎన్నికలు అయిపోయాక తొండలు గుర్తుకు వస్తాయి. తొక్కుడు గుర్తుకు వస్తుందన్నారు. కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ..
Kavitha: నాకు కూడా టైం వస్తుంది.. నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు.. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతనని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఇంకా చిట్టా విప్పదు.. ఇది కేవలం టాస్ మాత్రమే అన్నారు. దీనికే…
Uttam Kumar Reddy: ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పాలసీ అర్థం కాక చేస్తున్నారా..? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కూడా కాదని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద విద్యుత్ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్రావు నిన్న(బుధవారం) ఆరోపించారు. రామగుండం, పాల్వంచ, మక్తల్లలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర…
Vikarabad: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మతన్ గౌడ్ గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్ ఖరారైంది. గ్రామంలో ST కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. గ్రామంలో 494 మంది ఓటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో వారి ఆనందానికి అవధులే వేరు.. ఎరుకల భీమప్ప, భార్య వెంకటమ్మ గ్రామంలో చీపుర్లు, బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నారు..…