Khanapur Municipality: గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలపడంతో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ వశమైంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని విషయం తెలిసిందే. Shaheen-III vs Agni-V: పాకిస్థాన్ ఈ “మిస్సైల్”…
Bandi Sanjay: కవిత పార్టీ పెట్టడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ప్రజలకు ఉపయోగ పడితే ఆ ఆ పార్టీలను వారు స్వాగతిస్తారన్నారు. తాజాగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు గుడ్లు గుర్తుకు వస్తాయి. గాడిద గుడ్లు అంటారు. ఎన్నికలు అయిపోయాక తొండలు గుర్తుకు వస్తాయి. తొక్కుడు గుర్తుకు వస్తుందన్నారు. కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ..
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలుకాబోతోంది. కల్వకుంట్ల కవిత మార్చి 27న కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. శ్రీరామనవమి పర్వదినాన ఉదయం 8 గంటలకు ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కవిత తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె, ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి…
Jeevan Reddy: జగిత్యాల రాజకీయం కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీనీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక 27 నుంచి గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల్లో తిరుగుతూ పార్టీ మార్పుపై ప్రజలను అడిగి అభిప్రాయం తెలుసుకోనున్నారు. తనకు జరిగిన అన్యాయం.. పార్టీ ఫిరాయింపులపై ప్రజలకు వివరించాలనే…
Off The Record: తెలంగాణ బీజేపీ వ్యవహారాల మీద పార్టీ అధిష్టానం సీరియస్గా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారట. మరీ ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కనీసమైన పనితీరు కూడా చూపలేకపోయిన జిల్లాల అధ్యక్షుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట పార్టీ పెద్దలు. అందుకే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న జిల్లా అధ్యక్షులపై స్టేట్ ప్రెసిడెంట్ రామచందర్ రావు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్…
Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇన్నాళ్ళు రకరకాలుగా ఎదురు చూసీ…చూసీ….ఇక ఫైనల్గా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ మీదే హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి విస్తరణ సమయంలో తర్వాత ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం రంగారెడ్డి జిల్లాకు స్థానం…
Off The Record: పాలమూరు మేయర్ ఎన్నిక ఎపిసోడ్లో చిత్ర విచిత్రాలు జరిగాయా? కాంగ్రెస్ శిబిరంలోకి పరోక్షంగా చొరబడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందా? వాళ్ళు డబ్బులు పంపారన్న ఆరోపణల్లో నిజమెంత? ఇన్నాళ్ళు కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సైతం ఈ దెబ్బకు బట్టబయలయ్యాయా? సీఎం సొంత జిల్లాలోని మెయిల్ మున్సిపాలిటీలో పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. సియం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతంరం చెందిన మహబూబ్ నగర్ను కాంగ్రెస్ పార్టీ…
Off The Record: నా…. నియోజకవర్గం నా ఇష్టం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజు నేనే…. రారాజు నేనే….. సామంత రాజుని కూడా నేనే. స్టేట్ లీడర్స్ పేరుతో ఎవ్వరూ కాలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఎవరైనా రావాలనుకున్నా నేను పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఒకనాడు వీర లెవల్లో స్టేట్మెంట్స్ ఇచ్చేశారు అప్పటి మాజీ, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. READ ALSO: Off The Record: లోకేష్ రాజమండ్రి టూర్ రద్దు…
Bhatti Vikramarka: ప్రజాభవన్లో నిర్వహించిన టెలంగాణ ఎంపీల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ తప్పనిసరని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అడ్జర్న్మెంట్ మోషన్ లేదా…
Ponnam Prabhakar: బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడేది తాము మాత్రమేనని, ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.. బీఆర్ఎస్, బీజేపీ. బలహీనవర్గాల ద్రోహులు అని మండిపడ్డారు.. గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ పరిమితిని అధిగమించేందుకు ప్రభుత్వం సేకరించిన డాటా, నివేదికలు ఆధారంగా కోర్టులో…