తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏప్రిల్ నెల నుంచి ఈ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనాలు అందుతుంటాయి. దీనివల్ల కమిషన్ల…