Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకి ప్రమాదం ఉన్నందున ఈ వర్షాకాలంలోనే అన్ని గేట్లను తెరవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.