Kavitha: నిజామాబాద్ జిల్లా యంచలో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి నది ముంపు ప్రాంతాల్లో పంట నష్టం జరగడానికి మంత్రులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. కవిత మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు, అధికారుల పాపం, నిర్లక్ష్యం వల్లే పంట నీట మునిగింది. ముంపు బాధిత రైతులకు ఎకరానికి రూ.50 వేలు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. పంట నష్టంపై జిల్లా…
Prakash Reddy: హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రికి ఏ పంటకు ఏ ఎరువులు వాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎరువులపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కేంద్రప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో 268 అమ్మాల్సిన ఎరువుల…