Kavitha: నేను బీఆర్ఎస్లో లేను.. రైతుల పక్షాన ఉంటాను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha: నిజామాబాద్ జిల్లా యంచలో జరిగిన కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరి నది ముంపు ప్రాంతాల్లో పంట నష్టం జరగడానికి మంత్రులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. కవిత మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు, అధికారుల పాపం, నిర్లక్ష్యం వల్లే పంట నీట మునిగింది. ముంపు బాధిత రైతులకు ఎకరానికి రూ.50 వేలు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. పంట నష్టంపై జిల్లా కలెక్టర్ మరోసారి సర్వే చేయించాలని ఆమె కోరారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేసి ఉంటే ముంపు ఈ స్థాయిలో ఉండేది కాదని కవిత అభిప్రాయపడ్డారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ.. సగం పంట అమ్ముకున్నాకే ప్రభుత్వం ధాన్యం కొంటుందని విమర్శించారు. వరి పంటకు మద్దతు ధర, బోనస్ రావడం లేదని, అలాగే మొక్కజొన్న, పసుపు పంటకు కూడా మద్దతు ధర ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంపై స్పందించిన కవిత, ఆయనకు చురకలు అంటించారు. ఇటీవల షకీల్ హైదరాబాద్కి వెళ్లినట్లు ఉన్నారు.. వచ్చిపోవడం కాదు.. వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని కవిత హితవు పలికారు. అలాగే ఆమె తెలంగాణ సంస్కృతి, రైతుల హక్కుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ చేతిలో నుంచి బతుకమ్మను తొలగించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బోనస్, బతుకమ్మ చీరలు, తులం బంగారం రావాలంటే పిడికిలి ఎత్తి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే కవిత మాట్లాడుతూ.. “నేను బీఆర్ఎస్ పార్టీలో లేను కానీ, రైతుల పక్షాన ఉంటాను. బీఆర్ఎస్లో ఉన్నా, లేకున్నా, రైతుల పక్షానే ఉంటా” అని స్పష్టం చేశారు. ముంపు బాధిత రైతుల కోసం భారీ స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.
Cardamon Benefits: రోజుకు రెండంటే.. రెండు చాలు.. ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోను..!
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?