అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యార్థినులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. చదువుకునే అమ్మాయిల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. త్వరలోనే వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు.. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం…