అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వించడానికా ప్రజా ప్రతినిధిగా తమరు గెలిచింది? ఎక్కువ దోపిడీలు చేశారనా ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు?' అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తేనే నేను సహకరిస్తాను.. వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు.. ఆ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇంప్రెస్ చేయడానికి ఆయన నానా పాట్లు పడ్డారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడికి ఒక్క ముక్క హిందీ రాదు.. తెలుగులో రాసుకొని హిందీలొ చదివాడు అని చెప్పారు.
ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతలు ఎక్కువ మందిలో ఆందోళన పెరుగుతోందా? బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ అని ప్రచారం చేద్దామంటే… తమ భవిష్యత్కే గ్యారంటీ లేకుండా పోతోందని కంగారు పడుతున్నారా? ఇక్కడి నేతలు ఏం కోరుకుంటున్నారు? పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు? కొందరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మరి కొందరు పక్క పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారు? కడప టీడీపీలో కలకలం రేగుతోందట. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతం అవుతున్నారు నేతలు. ఇన్నాళ్ళు నానా…
టీడీపీ అంటే మా ప్రాణం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ కోసమే ప్రాణాలు వదిలారు అని కోడెల శివరాం తెలిపారు. పార్టీని విడిపోవాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదు.. కోడెల పేరు వినపడకూడదని ఆలోచనతో కొంత మంది నియోజకవర్గంలో మా మీద దుష్ప్రచారం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుని ప్రతి ఓటర్ను గుర్తించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జలదంకి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. జలదంకి మండల కన్వీనర్ కె. మధుమోహన్ రెడ్డి అధ్యక్షతన…
నెల్లూరు సిటీ పరిధిలోని జండా వీధి.. చిన్న బజార్ ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి నారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు పాత నగరంలో వర్షపు నీరు రాకుండా ఉండేందుకు పలు చర్యలను గతంలో చేపట్టామన్నారు.